జమ్మలమడుగులో మరోసారి టెన్షన్..

Update: 2019-03-02 02:21 GMT

మరోసారి వైయస్ఆర్ కడప జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రచారానికి సిద్ధమైన వైఎస్సార్‌ సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేయటంతో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డిలు శనివారం ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ వర్గీయులు అడ్డుకునే ప్రమాదం ఉంది. దాంతో ఉద్రిక్తపరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు ముందుగా వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సుధీర్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పులివెందులలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అక్కడ అరెస్ట్‌ చేశారు. 

Similar News