అక్టోబర్ 10 నుంచి వైఎస్‌ఆర్ కంటి వెలుగు పథకం

Update: 2019-09-25 15:08 GMT

ఆంధ్రప్రదేశ్‌లో 'వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం' ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకం 5 దశల్లో అమలు కానుంది. ఒకటి రెండు దశల్లో పాఠశాల విద్యార్ధులకు కంటి పరీక్షలు జరగనుండగా మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటీ బేస్ పద్దతిలో కంటి పరీక్షలు జరగనున్నాయి. పథకం పర్యవేక్షణకు కలెక్టర్‌ చైర్మన్‌గా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేశాయి. ఈ పథకానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags:    

Similar News