ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. నిన్న దాదాపు 12 మంది కీలక నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరిలో ప్రముఖంగా కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక, ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు వంగా గీత, ద్రోణంరాజు శ్రీనివాసరావు, పాటిల్ నీరజారెడ్డి, మక్కెన మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏలూరు రామచంద్రారెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ తాడి శకుంతల, విశాఖ జనసేన అభ్యర్థి గేదెల శ్రీనుబాబు, మంత్రి అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్మోహన్రెడ్డి తదితరులంతా వైసీపీలో చేరారు.