మాజీ ఎంపీ, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి కడప జిల్లా పులివెందులలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.. మధ్యాహ్నం కుటుంబ సభ్యుల సమక్షంలో వివేకా దేహానికి పోస్టుమార్టం నిర్వహించడంతో హత్య
విషయం బయటపడింది. అంతేకాదు ఆయనది ఖచ్చితంగా హత్యేనని పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిట్.. వివేకా ఇంట్లో పనిమనుషులు, డ్రైవర్ తోపాటు సుధాకరరెడ్డి అనే అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.