అందుకే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు: జగన్

Update: 2019-07-12 05:57 GMT

టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నా వడ్డీ రుణాల అంశంపై తాను వివరణ ఇస్తున్న సమయంలో పదేపదే అడ్డు తగుతున్నారంటూ తీవ్ర స్ధాయిలో స్పందించారు. మనిషి పెరగడం కాదు బుద్ది పెరగాలి అంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి అన్నారు. గుడ్లు ఉరిమి చూస్తే తాను భయపడబోనన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి అంశానికి అచ్చెన్నాయుడిని లేపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, టీడీపీ తరఫున సభకు వచ్చినవారంతా అలాగే ప్రవర్తిస్తున్నారన్నారు. రౌడీలు, గుండాల్లా సభలో వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు. వ్యవసాయ రుణాల్లో సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వకపోయినా ఇచ్చామని చెప్పుకుంటున్నారని, అందుకే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. 

Tags:    

Similar News