గోడ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్

Update: 2019-03-27 15:18 GMT

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. సభకు సమీపంలోని పాతభవనం పిట్టగోడ కూలిపోయింది.. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. జగన్ ను చూసేందుకు జనం ఆ గోడ ఎక్కడంతో బరువుకు కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో సమాచారం తెలుసుకున్న జగన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి..

చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా వైయస్ జగన్ ఇవాళ మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండపేట బహిరంగ సభ ముగించుకున్న ఆయన హెలికాఫ్టర్ లో హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం నుంచి రోజుకు నాలుగు జిల్లాల్లో ప్రచారం నిర్వహించాలని జగన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

Similar News