ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలవనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్ను జగన్ కలవనున్నట్టు ఆ పార్టీ పేర్కొంది. గవర్నర్ తో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ఇతర అవకతవకలపై ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పోలీసు ఆఫీసర్ల నియామకాల్లో అధికార దుర్వినియోగంపై ఫిర్యాదులో జగన్ పేర్కొననున్నారు. కాగా లక్షల్లో నకిలీ ఓట్లను సృష్టించారని ఇప్పటికే రకరకాల సర్వేల పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని..ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాను ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.