రాజధాని భూముల్లో అతి పెద్ద కుంభకోణం : వై.ఎస్.జగన్

Update: 2019-05-26 09:56 GMT

ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసని, రాజధాని అమరావతి భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో బినామీలతో తక్కువ ధరకు భూములు కొనిపించారని, ల్యాండ్ పూలింగ్ లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారని, నచ్చిన వారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారని ఆరోపించారు. రాష్ట్ర పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని, ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సమీక్షల తర్వాతే శ్వేతపత్రాలు విడుదల చేస్తామని అన్నారు. 

Similar News