పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యువకుడి కిడ్నాప్ చెర వీడింది. ఆ యువకుడ్ని దుండగులు దారుణంగా కొట్టి వదిలేశారు. బాధితుడికి అతడి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ తో పాటు ఆర్థిక లావాదేవీలే యువకుడి కిడ్నాప్కు కారణమని తెలుస్తోంది.
వారం క్రితం భీమవరంలో లోకేష్ అనే యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. రెండు లక్షలు ఇవ్వాలంటూ లోకేష్ తల్లిదండ్రులకు దుండగులు బెదిరించారు. విశాఖ జిల్లా భీమిలికి లోకేష్ ను తీసుకెళ్లి దుండగులు కొట్టారు. తీవ్ర గాయాలైన లోకేష్ ను తిరిగి భీమవరంలో వదిలేశారు. లోకేష్ ను ఆసుపత్రికి తరలించిన అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రికెట్ బెట్టింగుల్లో 35 లక్షలు బాకీపడడంతో కిడ్నాప్ కు గురైనట్లు తెలుస్తుంది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే కిడ్నాప్ కు కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.