Visakhapatnam: విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Visakhapatnam: పట్టాభి వ్యాఖ్యలపై ఆందోళనకు దిగిన వైసీపీ మహిళలు

Update: 2021-10-19 15:08 GMT

విశాఖలో వైసీపీ మహిళాల ఆందోళన (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖలోని టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు పట్టాభి సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ మహిళలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. తక్షణమే పట్టాభి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలకు, వైసీపీ మహిళలకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. 

Tags:    

Similar News