ప్రజావేదిక మాకు కేటాయించండి.. సీఎస్ ను కోరిన వైసీపీ

Update: 2019-06-05 18:31 GMT

 ప్రజావేదికను పార్టీ కార్యక్రమాలకు ఇవ్వాలని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కోరారు.  పార్టీ కార్యక్రమాలు,పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందాని అయన చెప్పారు. పార్టీ సమావేశాలకు వసీపీ అధ్యక్షుని హోదాలో సీఎం జగన్ హాజరవుతారని  తలసిల రఘురాం పేర్కొన్నారు. సీఎం భద్రత, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ప్రజావేదిక అనువుగా ఉంటుందని అయన సీఎస్ దృష్టికి తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజావేదిక ను కేటాయించమని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఒకవేళ ప్రజావేదిక అక్రమకట్టడమని అధికారులు నిర్దారిస్తే.. తక్షణం ఖాళీ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రఘురాం హామీ ఇచ్చారు. 



Tags:    

Similar News