వరదల సమయంలో ఎవరి ఇల్లు ప్రమాదంలో ఉన్న ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కరకట్టపైనున్న చంద్రబాబు ఇంటితో పాటు మరో 32 మందికి రెవిన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆయన తెలిపారు. తన ఇల్లు ముంచడానికే వరద సృష్టించారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అన్నారు అంబటి రాంబాబ. చంద్రబాబు ఇల్లు ఖాళీ చేస్తే ఆయనకే మంచిది అని అంబటి తెలిపారు.