కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్గా యార్లగడ్డ వెంకట్రావు
-గన్నవరంలో వంశీపై పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ -యార్లగడ్డకు పదవిపై పార్టీలో ఆసక్తికర చర్చ
కృష్ణా జిల్లా కేంద్ర సహాకార బ్యాంక్ చైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.గన్నవరం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వల్లభనేని వంశీ చేతిలో ఓటమి చెందారు. వంశీ వైసీపీలోకి వచ్చిన నేపథ్యంలో యార్లగడ్డకు పదవి దక్కడంపై పార్టీలో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇటీవలనే యార్లగడ్డను పిలిచి భవిష్యత్ పై సీఎం జగన్ భరోసా ఇచ్చాు. వంశీ రాజీనామా చేసినా తిరిగి వంశీకే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని వంశీ వర్గీయులు అభిప్రాయపడుతుండగా.. యార్లగడ్డ అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.