వాలంటీర్ల వ్యవస్థ కూడా జన్మభూమి కమిటీల్లాంటిదే : విష్ణుకుమార్ రాజు

Update: 2019-07-17 10:37 GMT

టీడీపీ జన్మభూమి కమిటీల్లాగానే వాలంటీర్ల నియామకం కూడా ఉందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన వాలంటీర్ల వ్యవస్థ వలన చిక్కులు తప్పవన్నారు. టీడీపీ అవినీతి పార్టీగా మారడంతోనే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అయన గుర్తుచేశారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదనీ.. దాంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కూడా లేకుండా పోయిందని అన్నారు. నిర్మాణ రంగం కుదేలయ్యే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అంతే కాకుండా విశాఖలో జరిగిన భూకుంభకోణం పై సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News