ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది బదిలీ

Update: 2019-06-13 06:17 GMT

ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా కె. విజయానంద్‌ను నియమించారు. విజయానంద్‌ను నియమిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. తక్షణమే ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఎన్నికల సంఘం సూచించింది. ప్రస్తుతం విజయానంద్‌ ఏపీ జెన్‌కో సీఎండీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి సహా పలు అధికారిక పదవుల్లో సేవలందించారు.

Tags:    

Similar News