సొంతగూటికి చేరుకోనున్న వైసీపీ ఎమ్మెల్యే..

Update: 2019-03-14 10:17 GMT

ఏపీలో ఎన్నికల జంపింగులు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరిపోగా.. టీడీపీకి చెందిన అసమ్మతినేతలు వైసీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎంపీలు,

ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు.. తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీ తీర్ధం తీసుకునేందుకు రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వరుపుల సుబ్బారావు 2016 లో టీడీపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల సందర్బంగా ప్రత్తిపాడు సిట్టింగ్ సీటును ఆయన అన్న మనవడు రాజా కు కేటాయించారు చంద్రబాబు. దాంతో సుబ్బారావు టీడీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు వైసీపీలో చేరి టీడీపీ అభ్యర్థిని ఓడిస్తానని శపధం చేశారు. నేడో రేపో జగన్ సమక్షంలో సుబ్బారావు వైసీపీలో చేరనున్నారు.  

Similar News