2019 ఎన్నికల్లో చంద్రబాబు అందుకే ఓడిపోయారు: కేంద్రమంత్రి జవదేకర్‌

Update: 2019-07-08 11:13 GMT

ఇటివల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగలేని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే జోష్ లో ఉన్న బీజేపీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) తిరుపతిలో నిర్వహించిన సంస్థాగత పథం కార్యక్రమాని ముఖ్య అతిథిగా కేంద్ర పర్యావరణ, సమాచారశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పాల్గొని బీజేపీ పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2019ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ జట్టుకట్టి విజయం సాధించారని, ఇక పోతే 2019 ఎన్నికల్లో విభేదించి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని అన్నారు.తోడుంటేనే దేశంలో ఎవరికైనా అధికారం దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మోడీ చరిష్మా దేశమంతటా ఓ ఉప్పెనలా పొంగుతోందని, మోడీ చేసిన అభివృద్ధి అన్ని వర్గాల ప్రజలను బీజేపికి అభిమానులను చేసిందని చెప్పారు.

Tags:    

Similar News