ఏపీ ఈసీ నుంచి లేఖ వచ్చింది.. ఈసీకి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తాం : కిషన్ రెడ్డి

Update: 2020-03-20 06:41 GMT
Kishan Reddy

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ లేఖ తమకు వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈసీ రమేష్ కుమార్ భద్రతపై ఏపీ డీజీపీతో మాట్లాడుతానని తెలిపారు. ఈసీకి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.

ఏపీఎస్‌ఈసీ రమేష్ కుమార్ రాసిన లేఖ అందింది. మాకు తెలిసిన వివరాల ప్రకారం ఆయనే రాసినట్టు తెలుస్తోంది. రమేష్‌కుమార్‌కు భద్రత కల్పిస్తున్నాం. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినప్పుడల్లా భద్రత కల్పిస్తారు. రమేష్‌కు భద్రత కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. నేను కూడా ఏపీ డీజీపీతో మాట్లాడతాను' అని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రమేశ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయనకు తగిన భద్రత ఉంది. కేంద్రం ఆదేశాల మేరకే సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఏర్పాటు చేశారు. రమేష్‌ కుమార్‌ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినా పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాం. అవసరమైతే ఇవాళ లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేస్తాం'' అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Tags:    

Similar News