సీఎం జగన్ను కలిసిన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి భేటి అయ్యారు. టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. పాలక మండలిలో ఎవరెవరిని నియమించాలనే దానిపై చర్చ జరిగింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి భేటి అయ్యారు. టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. పాలక మండలిలో ఎవరెవరిని నియమించాలనే దానిపై చర్చ జరిగింది. ఇదే సమయంలో టీటీడీలో ఇటీవల పరిణామాలపై సీఎం జగన్ ప్రస్తావించినట్టు సమాచారం. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పిదాలు జరగలేదంటూ వివరణ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి ... బంగారు ఆభరణాల టీడీపీ హాయంలోనే జరిగినట్టు సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రికవరీకి మాత్రమే చర్యలు తీసుకోవడం వల్ల వివాదాలు వచ్చాయంటూ చెపినట్టు సమాచారం.