పేదల ఆకలి తీర్చనున్న తిరుమల వెంకన్న

ఆకలితో అలమటించే పెదవారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

Update: 2020-04-15 05:57 GMT
TTD (file photo)

ఆకలితో అలమటించే పెదవారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో తినడానికి తినడానికి తిండి లేకుండా సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదుతూ చూస్తున్నారు. అలాంటి వారిని ఆడుకోవడానికి టీటీడీ ముందుకు వచ్చింది. ఈ మేరకు 13 కోట్లు రూపాయల నిధులు విడుదల చేసింది.

టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి బోర్డు అధికారులు అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయలు అందించనుంది. ప్రతి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 3వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసింట్లు అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.


Tags:    

Similar News