సంక్రాంతి కోడిపందాల్లో విషాదం నెలకొన్నది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో పందెం కోడి కత్తి తగిలి ఒకరు మృతి చెందారు. కోళ్ల కాళ్లకు కత్తులు కడుతుండగా ఓ కోడి ఒక్కసారిగా కాళ్లు విదిలించడంతో సరిపల్లి చిన వెంకటేశ్ అనే వ్యక్తి కాలు తొడభాగంలో కత్తి గుచ్చుకుంది. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పకటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.