కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా...ముగ్గురు మృతి

Update: 2020-01-17 05:14 GMT
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా...ముగ్గురు మృతి

కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. 25 మంది కూలీలతో వెళ‌్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కూలీలు అందరూ అనిగండ్లపాడు, వెల్దుర్తిపాడుకు చెందిన వారిగా గుర్తించారు. వ్యవసాయ పనుల కోసం దేసినేనిపాలెం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కూలీలు ప్రయాణిస్తున్న టాక్టర్‌ ఆటోను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అతివేగం వల్లే ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News