మా ప్రభుత్వంలో దోపిడీ ఉండదు: మంత్రి అనిల్

Update: 2019-06-15 08:00 GMT

ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పుత్తూరు మున్సిపాలిటి కి తెలుగు గంగ నుంచి 1.3 టీఎంసీ తాగునీరు అందించేఫైలుపై తొలి సంతకం చేశారు. జగన్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్న ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నాకు అప్పగించిన బాధ్యతను ఓ ఛాలెంజ్‌గా తీసుకుని పని చేస్తానని వైఎస్‌ హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. తమ ప్రభుత్వంలో దోపిడి అనేది ఉండదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

Tags:    

Similar News