అనంతపురంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ..

Update: 2019-07-14 01:59 GMT

అనంతపురం జిల్లా కొత్త చెరువులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో కొత్తచెరువు మండల కేంద్రంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అనాదికాలంగా ఆనవాయితీగా వస్తున్న ఎడ్ల పందేల పోటీలో రాజకీయ రంగు పులుముకుంది. అయితే ఇరువర్గాల వారు పార్టీ జెండాలు ఎజెండాలు ఎత్తడంతో ఘర్షణ వాతావరణం మొదలైంది. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కొత్తచెరువు చేరుకుని పరిస్థితిని చక్కబెట్టి ఆనవాయితీగా వస్తున్న ఎడ్ల పందాలను సజావుగా నిర్వహించారు.  

Tags:    

Similar News