టీడీపీకి ప్రతిపక్ష హోదా మిగలదు: మంత్రి అవంతి

Update: 2019-06-30 13:05 GMT

త్వరలో టీడీపీ ప్రతిపక్ష హోదా కోల్పోతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. విశాఖలో వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. విశాఖ జిల్లలో వైసీపీ అనుకున్నంత మేర రానిన్చాకపోవడానికి కారణాలను తెలుసుకోవడానికి విస్తృతంగా సమీక్షిస్తామని చెప్పారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పారు. నియోజకవర్గాల్లో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యకర్తలు లేనిదే ఏ పార్టీకి మనుగడ ఉండందాని చెప్పిన అవంతి కార్యకర్తలు అభద్రతా భావానికి గురవ్వద్దనీ, వారికి అండగా తామున్తామనీ భరోసా ఇచ్చారు.  

Tags:    

Similar News