ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. జగన్ ది సున్నా వడ్డీ కాదు, సున్నా పరిపాలన అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొనసాగే పథకాలకు గత ప్రభుత్వాల బకాయిలు ఎగ్గొట్టడం గర్హనీయమన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని తానే తెచ్చానని జగన్ అసెంబ్లీలో చెప్పాడని టీడీపీ అంకెలతో సహా రుజువు చేసే సరికి మాట తప్పాడని అన్నారు. సీఎం జగన్ అబద్ధాల పితామహుడిగా మారారని వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న హామీని జగన్ గాలికొదిలేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.