టీడీపీ సీనియర్‌ నేతకు అస్వస్థత

Update: 2019-02-19 15:50 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మంగళవారం సీఎం చంద్రబాబుతో సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన బ్రహ్మయ్యకు స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా బ్రహ్మయ్య రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశిస్తున్నారు. ఆయనకు మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ అల్లుడు లోకేష్ గట్టి పోటీ ఇస్తున్నారు. లోకేష్ అభ్యర్ధిత్వాన్నే చంద్రబాబు దాదాపు ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

Similar News