వైసీపీ అధినేత వైయస్ జగన్ తో కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం భేటీ అయ్యారు. రెండు రోజుల్లో ఆయన సతీమణితో సహా వైసీపీలో చేరనున్నారు. కాకినాడ రూరల్, పెద్దాపురం అసెంబ్లీ లోని ఏదో ఒక నియోజకవర్గం తన భార్య వాణికి కేటాయించాలని ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్ తో.. తోట భేటీ అవ్వడంపై టీడీపీ సీరియస్ అయింది. ఆయనపై వేటు వేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.