18 మంది టీడీపీ ఎంపీలు మాతో టచ్ లో ఉన్నారు : బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్

Update: 2019-07-04 12:23 GMT

ఇప్పటికే ఎవరు ఎటు వెళతారో అనే సందిగ్ధంలో తెలుగుదేశం పార్టీ కొట్టుమిట్టాడుతుంటే, బీజేపీ నాయకులు రోజుకో బాంబు పేలుస్తున్నారు. నిజానిజాల మాట ఎలా ఉన్నా ఇవి పొలిటికల్ సర్కిల్ లో పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి.

ఇటీవల బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో టీడీపీ ఎంపీలు 18 టచ్ లో ఉన్నారని అయన చెప్పారు. ప్రముఖ న్యూస్ ఏజన్సీ ఐఏఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ గురించి అయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. పార్టీ ఇమేజ్ ని ఇది దెబ్బతీసిందన్నారు. అందుకే మునిగిపోయే నావ టీడీపీ లో ఉండడం ఎందుకని.. బయట పడటం కోసం తమను సంప్రదిస్తున్నారని అయన తెలిపారు. ఏపీలోని ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో లక్ష మంది కొత్త సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలకు దగ్గర అయ్యేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు.  

Tags:    

Similar News