విజయవాడ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సమయంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి నిత్యావసర వస్తువులు , కూరగాయలు పంపిణీ చేసి వారిని ఆదుకున్న 14 వ డివిజన్ తేదేపా శ్రేణులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అభినందించారు. 14 డివిజన్ తేదేపా పార్టీ కార్యాలయంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంతో పాటు బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్య అతిధిగా హాజరై కేకుకట్ చేసి ప్రసంగించారు.ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ లాక్ డౌన్ కాలంలో పార్టీ శ్రేణులు చేసిన సేవలు అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో డివిజన్లో కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని, పార్టీ ఆశయాలను ముందుకు తీసువెళ్ళాలని పిలుపునిచ్చారు. వైకాపా ఏడాది పాలనపై సర్వత్రా వ్యతిరేకత కనపడుతోందని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధనాలను ప్రజలకు వివరించి, వారిని చైతన్య పరచాలని, పార్టీ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలన్నారు.