ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి చెందిన కొందరు నేతలు వైసీపీలో చేరారు. గుంటూరు జిల్లా గుజరాల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత డాక్టర్ ఉన్నం నాగ మల్లిఖార్జున రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం తదితర నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.
వీరికి వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ఇద్దరు నేతలు గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. కాగా రేపు(జనవరి 31) జగన్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీ తీర్ధం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.