పోలవరం టెండర్ల రద్దుపై టీడీపీ నేత దేవినేని ఉమ ఫైరయ్యారు. పోలవరం కాంట్రాక్టు రద్దు చేయడం సరికాదన్నారు. ప్రాజెక్టు అథారిటీలో పనులు జరుగుతున్నాయని.. పరిగెత్తే ప్రాజెక్టుకు కాలడ్డంపెట్టడం కరెక్ట్ కాదన్నారున్నారు. విజయసాయిరెడ్డి పోలవరంపై ట్విట్టర్ స్పందించడంపై సిగ్గుపడాలన్నారు. ట్విట్లు మానేసి దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని.. శకవత్ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్యామ్ దగ్గర నుంచి నిర్మాణ సంస్థల్ని వెనక్కి రమ్మంటున్నారన్నారు. మరి నిర్వాసితుల పరిస్థితి ఏంటని దేవినేని ఉమ విమర్శించారు.