వరదలు, ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ఏపీలో నాలుగువేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. సీఎం జగన్ అమెరికా నుంచి వచ్చినా, వరద బాధితులను పట్టించుకోకుండా, ఢిల్లీ వెళ్లిపోయారని మండిపడ్డారు. మంత్రులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్న దేవినేని ఉమ.... ఇంతవరకు వరద నష్టం అంచనాలను రూపొందించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్తో పనులు ఆలస్యం, ఖర్చు పెరగడం తప్పా... ప్రయోజనం ఏమీ ఉండదన్నారు దేవినేని ఉమ.