క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

క్రిస్మస్ పండగ సందర్బంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.

Update: 2019-12-25 08:32 GMT
చంద్రబాబు నాయుడు

క్రిస్మస్ పండగ సందర్బంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. విజయవాడలోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ చర్చి ఫాదర్ తో కలిసి కేకే కట్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తమ హయాంలో చర్చిలకు క్రిస్మస్ బహుమతులు ఇచ్చామని గుర్తు చేసుకున్నారు.

ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమ పూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త క్రీస్తు అని అన్నారు. అలాగే తన పేరుతో ఒక శకానికి నాంది పలికిన క్రీస్తు చరిత్ర పవిత్రం. ఆయన జన్మదినం సర్వ మానవాళికీ పవిత్రదినం. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! అని తెలిపారు.  

Tags:    

Similar News