జగన్ ప్రమాణ స్వీకారానికి భారీ భద్రత

Update: 2019-05-29 06:57 GMT

ఆంధ్రపరదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. 5000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే పార్కింగ్ స్థానాల కేటాయింపు, ట్రాఫిక్ మల్లింపు విషయాలను ఖరారు చేసిన పోలీసు అధికారులు.. జగన్ భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రత్యేక దృష్టి సారించారు. 

ప్రమాణోత్సవానికి పెద్ద ఎత్తున నాయకులు, సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. నిన్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తో జరిగిన సమావేశంలో జగన్ ఈ విషయాలన్నిటిపైనా సమీక్ష జరిపారు. 
 

Similar News