శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రేపు (సోమవారం)దీక్ష విరమించనున్నారు. తాడేపల్లిలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో దీక్ష విరమణకు సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఉత్తరాధికారిగా ప్రవీణ్ కుమార్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, గత రెండు రోజులుగా ఉత్తరాధికారి బాధ్యతల స్వీకరణ నిమిత్తం ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. రేపు చివరి రోజు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 5.50 గంటలకు సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు.