Chittoor: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కరోనా కలకలం

Chittoor: దేవస్థానంలోని 16 మంది ఉద్యోగులకు సోకిన కోవిడ్ * రెండు రోజుల నుంచి తగ్గిన భక్తులు

Update: 2021-04-21 02:34 GMT

శ్రీకాళహస్తి  టెంపుల్ (ఫైల్ ఫోటో)

Chittoor: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కరోనా కలకలం రేపుతోంది. దేవస్థానంలో పనిచేసే 16 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. వివిధ శాఖలలో పని చేస్తు్న్న సిబ్బందికి కరోనా సోకింది. కోవిడ్ నిబంధనల మేరకు ఆలయాల్లో చర్యలు తీసుకున్న వైరస్ మహమ్మారి ఆగడం లేదు. దాంతో భక్తులు లేక దేవస్తానం వెలవెలబోతున్నాయి.

శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి రాహుకేతు పూజలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టు పక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో గత రెండు రోజుల నుంచి భక్తులు రాక తగ్గిందంటున్నారు ఆలయ అధికారులు.

Tags:    

Similar News