Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Road Accident: తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Road Accident: కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం ఏటూరు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వైపు వస్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రి, బళ్లారికి చెందిన వారు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈప్రమాదం జరిగింది.