పోలవరం ఎమ్మెల్యేకు భద్రత పెంపు

Update: 2019-06-16 11:19 GMT

 ఒకవైపు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించి ఓటమి పాలైన వారందరికీ భద్రతను ఉపసంహరిస్తూనే మరోవైపు అధికారపక్షంలో ఉన్న శాసన సభ్యుల విషయంలో మరికొన్ని జాగ్రత్తలను పోలీసులు పాటిస్తున్నారు. ఇప్పటిదాకా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సాధారణ ఎమ్మెల్యేగా 1+1 కేటిగిరిలో భద్రత కల్పిస్తున్నారు. కాని దీనిని తాజాగా సవరించారు. దీని ప్రకారం ఎమ్మెల్యే బాలరాజుకు మంత్రులతో సమానంగా 2+2 భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడం, అందున ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలు ఆంధ్రాలో విలీనం కావడం, మావోయిస్టుల సంచారం ఉండడం కారణంగా ఈచర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు.

Tags:    

Similar News