Andhra News: నేడు ఏపీలో రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభం
Andhra News: వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా పథకం కింద అంబులెన్సులు ప్రారంభం
Andhra News: నేడు ఏపీలో రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభం కానున్నాయి. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా పథకం కింద అంబులెన్సులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సుమారు 240 కోట్లతో 340 పశువుల అంబులెన్సులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మొదటి దశలో 129 కోట్లతో 175 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండో దశలో రూ.112.62 కోట్లతో మరో 165 పశువుల అంబులెన్సులు ప్రారంభించనున్నారు. పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం.