సత్తెనపల్లి వైసీపీలో కొంతకాలంగా అసమ్మతి నెలకొంది. పార్టీ ఇంచార్జ్ అంబటి రాంబాబు తమకు కలుపుకుని పోవడం లేదంటూ ఓ వర్గం ఆయనపై గుర్రుగా ఉంది. ఇటీవల అసమ్మతి వర్గం సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ వ్యవహారం అధిష్టానం వరకూ వెళ్ళింది. దాంతో రంగంలోకి దిగిన అగ్రనేతలు అసమ్మతి వర్గాన్ని హైదరాబాద్కు పిలిపించి చర్చింనట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు చర్చలు జరిపిన అధిష్టానం ఎట్టకేలకు పరిస్థితిని సద్దుమణిగేలా చేసింది. ఏవైనా పొరపాట్లు ఉంటే సర్దుకు పోవాలని సూచించింది. అధిష్టానం సూచనతో మెత్తబడ్డ ఆ వర్గం అంబటికి సహకరిస్తామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.