పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభ జరగనసుంది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో భారీగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులను దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సమర శంఖారావ సభలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నెల్లూరులో నాలుగో ఇది సభ. జిల్లాలోని పది శాసనసభా నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూత్ల కమిటీల కన్వీనర్లు, పరిశీలకులు హాజరుకానున్నారు. వాస్తవానికి గతనెల 13 న ఒంగోలులో జరగాల్సిన సమర శంఖారావం సభ వాయిదా పడింది. దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు ఆ పార్టీ.