పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా గొట్టగూడెం వద్ద మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
పశ్చిమగోదావరి జిల్లా గొట్టగూడెం వద్ద మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా పెడన నుంచి గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.