Tirupati: తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

Tirupati: ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయత్నంలో ఢీకొన్న ఆర్టీసీ

Update: 2023-05-25 03:01 GMT

Tirupati: తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

Tirupati: తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తమిళనాడు తిరువళ్లూరు నుంచి తిరుపతి వస్తున్నప్రైవేటు బస్సు ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ ప్రైవేటు బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సులో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న డైవర్‌ను జెసిబి సాయంతో వెలికి తీశారు. ఆర్టీసీ కండక్టర్ జాఫర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News