Guntur: గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మహిళలు మృతి
Guntur: అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు
Guntur: గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 8 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేశామని, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మహబూబ్ బాషా స్పష్టం చేశారు.