ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీరాజ్ నియామకం

Update: 2019-07-20 03:28 GMT

 శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా సినీనటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ నియ‌మితుల‌య్యారు. ఈ నెల 28న ఎస్వీబీసీ ఛైర్మన్‌, డైరెక్టర్‌గా బాధ్యత‌లు స్వీక‌రించ‌నున్నారు. తిరుప‌తిలో జ‌రిగిన ఎస్వీబీసీ బోర్డు స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీ పార్టీకి సేవలందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ డైరెక్టర్‌ రాఘవేంద్రరావు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యత‌లు నిర్వర్తించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత‌ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

Tags:    

Similar News