తిరుమల రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Update: 2019-07-13 03:34 GMT

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ తిరుమలకు రానున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని, కపిలేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతికి తిరుమలకు వెళ్తారు. రేపు ఉదయం శ్రీవారిని కోవింద్ దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News