కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు చాలా చోట్ల వైసీపీ అభ్యర్థుల పేర్లతో పోలి ఉండేటట్టుగా ఉన్నాయి. ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్ వేశారు. ఈ నియోజకవర్గంనుంచి వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు.
అలాగే గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరు నంబూరు శంకరరావు కాగా.. ఇక్కడ ప్రజాశాంతిపార్టీ నంబూరి శంకరరావు అనే పేరు గల వ్యక్తిని నిలబెట్టింది. ఇక అనంతపురం జిల్లాలో అయితే ఏకంగా 8 మంది అభ్యర్థులు వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉండటం విశేషం.