వైసీపీలో చేరిన పొట్లూరి వరప్రసాద్

Update: 2019-03-13 04:25 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు విజయవాడ లోక్ సభ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన చేరిక సందర్బంగా విజయవాడ పార్లమెంటు పరిధిలోని వైసీపీ ఇంఛార్జులను హైదరాబాద్ కు పిలిచింది వైసీపీ అధిష్టానం. మరోవైపు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న దాసరి జై రమేష్ పివిపి చేరికపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.వైసీపీలో చేరిన పొట్లూరి వరప్రసాద్ 

Similar News