నటుడు పృద్వీ వాఖ్యలపై పోసాని సీరియస్

సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మెన్ పృద్వీ రాజ్ అమరావతి రైతులపై చేసిన వాఖ్యలపై నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు.

Update: 2020-01-09 16:07 GMT

సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మెన్ పృద్వీ రాజ్ అమరావతి రైతులపై చేసిన వాఖ్యలపై నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. పండే భూముల్ని త్యాగం చేనిన రైతులను పెయిడ్‌ ఆర్టిస్ట్‌లు అంటావా? కేవలం మురికి కాలువలో దిగెవరే రైతులని అంటే ఎలా అని పోసాని సీరియస్ అయ్యారు. రైతులు అన్నాకా చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? సెల్‌ఫోన్లులల్లో మాట్లాడకూడదా? ఖరీదైన బట్టలు వేసుకోరూడదా? అని ప్రశ్నించారు. ఏ మాత్రం నైతికత, వెంకటేశ్వర స్వామిపై భక్తీ ఉన్న సరే వెంటనే అమరావతి రైతులకి, ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని, అప్పుడే ఆ దేవుడు క్షమిస్తాడని వ్యాఖ్యానించారు.

పదేళ్ళుగా నేను జగన్ మోహన్ రెడ్డిని చూస్తూన్ననని, అయన ఒక్కసారి కూడా ప్రజల పట్ల, కులం పట్ల, మతం పట్ల ఎప్పుడుకూడా ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదని, అందుకే జగన్‌ను నేను గౌరవిస్తున్నానని పోసాని అన్నారు. ఇక పృథ్వీ లాంటి వారి మాటల వల్లే జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతింటోందని పోసాని వాఖ్యానించారు. జగన్ ప్రభుత్వానికి కూడా ఓ పాలసీ ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల పట్ల నిబద్దత ఉన్నవాడని, సేవ భావం ఉన్నవాడని, మీకు అన్యాయం చేయడని రైతులు శాంతించాలన్నారు. ఇక తనకు పృథ్వీపై ఎలాంటి కక్షా లేదని చెప్పుకొచ్చారు పోసాని.


Full View


Tags:    

Similar News